ప్రత్యేకం
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు

క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు క్లింకారా న్యూస్: సదాశివపేట మున్సిపాలిటీలో 14 నామినేషన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!

క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం! క్లింకారా న్యూస్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం!   తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఈ నెల 24 లేదా 27న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేట, వ్యూహాలు రచిస్తున్నాయి.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకారా న్యూస్: వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు

క్లింకారా న్యూస్:  వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు క్లింకారా న్యూస్:  వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ: భక్తులకు పిలుపు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం, 23-1-2026న జరిగే వసంత పంచమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారికి కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, అలంకరణ, మంగళ హారతి, మంత్ర పుష్పాలు, కుంకుమార్చనలు, అక్షరాభ్యాసాలు, ప్రదోష పూజ వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025,

జిల్లా పోలీసు కార్యాలయం,             సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 14-09-2025, జిల్లా పోలీసు కార్యాలయం,            సంగారెడ్డి జిల్లా.పత్రిక ప్రకటన తేది: 14-09-2025, •    జాతీయ మెగా లోక్-అదాలత్ లో 1698  కేసులలో రాజీ..•    సైబర్ క్రైమ్స్ 266 కేసులలో 1.05 కోట్ల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు అందేలా ఉత్తర్వులు..•    జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ. పరితోష్ పంకజ్ ఐపిఎస్. గారు.   ఈ సందర్భంగా ఎస్పీ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. గత నెల రోజుల నుండి నిన్న తేది: 13.09.2025 వరకు జరిగిన జాతీయ మెగా లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా అధికారులు సిబ్బంది పూర్తి నిబద్దతలో విధులు నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 540- ఐ.పి.సి., 318 - ఇ-పెట్టి, 840 - డిడి కేసులు మొత్తం = 1698 కేసులలో కక్షిదారులను రాజీ కుదిర్చడం జరిగింది అన్నారు. సైబర్ క్రైమ్ - 266 కేసులలో 1.5 కోట్ల రూపాయాలను తిరిగి సైబర్ క్రైమ్ బాధితులకు అందించే విధంగా ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది అన్నారు.  క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక సువర్ణావకాశం అని,  అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడవచ్చు అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలలో బాధితులకు సత్వర న్యాయం చేయడానికి, TGCSB [తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో]  డైరెక్టర్ శ్రీమతి. శిఖాగోయల్ ఐపిఎస్. గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన D4C సత్:ఫలితాలను ఇస్తుందని ఎస్పీ గారు అన్నారు.  ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేయాలని సూచించడం జరిగింది.  ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సబ్-డివిజినల్ అధికారులకు, D4C- డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు

వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు వర్షాకాలంలో_వైరల్_ఇన్ఫెక్షన్స్_రాకుండా_పిల్లల_విషయంలో_తీసుకోవాల్సిన_జాగ్రత్తలు వాతావరణంతడిగా మారిపోయింది. చినుకుల మాటున చింత కూడా దాగి ఉందని తెలుసుకుంటే మంచిది.ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రభాదం తీవ్రంగా ఉంటుంది. ప్రతి పదిమందిలో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వైరల్‌_ఫీవర్‌_అంటే_ఏమిటి ? వైరల్‌ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిమీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. కొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని ‘విష జ్వరాలు” అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్‌ జ్వరాలూ కూడా కొన్నిఉంటాయి. అలాగే తప్పనిసరిగా చికిత్స తీసుకోవల్సిన మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా వంటివీ వైరల్ ఫీవర్ క్రిందికే వస్తాయి.వివరాలు కు లింక్స్ లో చూడాలి  వైరల్_ఫివర్స్_ఎందుకు_వస్తాయి ? వైరల్‌ ఫీవర్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్‌ ఫీపర్స్‌ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరగడం వల్ల రక్సనాళాలు కుంచించుకుపోతాయి . దీంతో రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తీ తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. జన సముదాయం ఎక్కువగా ఉన్నచోట వైరస్‌ ఎక్కువగా లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి. వైరల్_ఫీవర్_లక్షణాలు_ఏమిటి ? వైరల్‌ ఫీవర్‌ సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం,నిస్సత్తువ, స్కీన్‌ రాషెస్‌, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం,దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి. వైరల్_ఫీవర్_ప్రభావాలు_ఏమిటి ? శరీరంలోని కణాల మీద వైరస్ ఎటాక్ అవుతుంది. చాలా వరకు వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ ఫుల్ గ ఉంటె నరాల మీద ప్రభావితం చేస్తుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది . పేషెంట్ బలహీనంగా మారిపోతారు. ఆహారం పూర్తిగా తీసుకోలేరు. రోగ_నిరోధక_శక్తిని_పెంచుకోవడం_ఎలా ? వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు చాయ్‌, బిస్కెట్‌, సమోసా వంటివి అలవాటు చేయొద్దు. స్నాక్స్‌ బదులుగా పండ్లు తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ జాతి ఫలాలను ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చ ఆలివ్_ఆయిల్   పిల్లలలో అయినా, పెద్దలలో అయినా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన జ్వరం ఉంటుంది. ఆ ఉషోగ్రతను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ను శరీరానికి రాసి మసాజ్ చేయాలి. కాటన్ దుస్తులు మరియు పలుచటి వస్త్రం కప్పి పడుకోబెట్టాలి. రెండేళ్లలోపు పిల్లలకు ఈ విధంగా చేయవచ్చు. తడి_సాక్స_తో_జ్వరానికి_వైద్యం  సాధారణం జ్వరం అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో తగ్గిపోతుంది. శరీర వేడి తగ్గడానికి కాటన్ సాక్స్ తీసుకుని చల్లని నీటిలో ఉంచి పాదాలకు తొడిగి విశ్రాంతి తీసుకోవడం వలన శరీర వేడి తగ్గుతుంది. సాక్స్ ఆరిన తర్వాత మళ్ళీ వేస్తూ ఉండాలి. కలబంద_రసం  కలబంద రసం లేదా జామ ఆకు నుండి తీసిన రసం తల నుదుటిపై రాయడం వలన శరీరవేడి తగ్గుతుంది. వేడినీటితో స్నానం.గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం బాడీ ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా జ్వరం వెంటనే తగ్గుతుంది.తల మెడ భాగంలో ఒక పలుచటి వస్త్రాన్ని తీసుకుని నీటిలో తడిపి తల, మెడ భాగంలో వేయడం వలన శరీరా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఆరిన తర్వాత మళ్ళీ వేయడం చేయాలి. వర్షా_కాలం_పిల్లలకు_వచ్చే_జబ్బులను_ఇంట్లోనే_నయం_చేసే_ఆయుర్వేద_నవీన్_సలహాలు  జ్వరానికి మనం ఇంటి వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో చూసాము కదా, అలాగే, వానాకాలం లో వేరే సాధారణ జబ్బుల బారి నుండి ఎలా బయట పడగలమో తెలుసుకుందాం ఇప్పుడు.వానా కాలం వచ్చేసింది. వానలు పేదలకు చిన్నలకి, చల్లదనాన్ని సంతోషాన్ని పంచుతాయి. వానల చిరు జల్లుల్లో తడిచి ఆనందాన్ని పొందాలని అందరికి ఉంటుంది. కానీ వర్షాలు వీటన్నిటితో పాటు క్రీములను, ఇన్ఫెక్షన్స్ ను, జబ్బులను కూడా మోసుకొస్తాయి. పిల్లలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. ఎంత కాపాడుకున్న రోగాలు తప్పకుండా వస్తాయి. ఆ వానా కాలం రోగాలను నయం చేసే ఆయుర్వేద నవీన్ సలహాలు   దగ్గు_జలుబు_జ్వరం  వాన కాలంలో గాలిలో ఉండే ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ జబ్బులకు కారణం. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కూడా అంటుకుంటుంది. పసి పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అల్లం రసం, గోరు వెచ్చని నీరు, ఒక్క చెంచా తేనే , బాగా కలిపి రోజులో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే త్వరగా ఉపసమనం లభించును. విరేచనాలు తాగే నీటి ద్వారా వైరస్, బాక్టీరియా కడుపులోకి చేరడం విరేచనాలు అవ్వడానికి కారణం. అవి జీర్ణ వ్యస్థను మందగింప చేస్తాయి. పిల్లలు కడుపునొప్పి, వాంతులు, డిహైడ్రాషన్, విరేచనాలతో బాధపడతారు. నిమ్మ రసం, దానిమ్మ రసం వాడటం వలన విరేచనాలు తగ్గును . దానిమ్మ పూర్తిగా కడుపునొప్పిని, విరేచనాలను తగ్గిస్తుంది. 6 నెలల లోపు పిల్లలకు గింజలు పెట్టకూడదు . గొంతులో అడ్డు పడే ప్రమాదం ఉంటుంది . కళ్ళ_కలక వర్షా కాలంలో ఎక్కువగా ఉండే బాక్టీరియా, వైరస్ కళ్ళ కలకకు కారణం. ఏది వచ్చినప్పుడు, పిల్లల కళ్ళు ఎర్రగా మారిపోతాయి, కంటి నుండి పుసి కారుతుంటుంది. ఉప్పు నీళ్ళతో కడగడం. కళ్ళ కలకకు ఇదే ఉత్తమమైన వైద్యం. వేడి నీళ్లలో కళ్ళు ఉప్పును కలిపి, దానితో పిల్లల కళ్ళను కడగాలి. డెంగ్యూ డెంగ్యూ జ్వరం ఏడెస్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ రకం దోమలు వానా కాలంలో ఎక్కువగా వస్తాయి. వీలున్నంత వరకు వీటి బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవడం మంచిది. తులసి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు మరగనివాలి . ఈ నీటిని పిల్లలకు ఇస్తూ ఉండాలి. అంతే కాకుండా ఆకులను పిల్లల చేత నమిలించాలి చర్మ_వ్యాధులు వానా కాలంలో అధికంగా వ్యాపించే క్రిములు, పిల్లలకు ఇన్ఫెక్షన్ లు కలిగించి, చర్మ వ్యాధులకు కారణమవుతాయి.పసుపు, వేపాకు పేస్ట్  వాడడం వలన చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. వేపాకులో ఎన్నో వైద్య గుణాలు ఉంటాయి. పసుపు వేపాకు కలిపిన పేస్ట్ ను ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రాంతంలో పూయడం వలన వెంటనే ఉపసమనం లభించును. ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇప్పటివి కాదు. తరతరాలుగా వస్తున్నా జ్ఞానం. ఇంటి చిట్కాల ద్వారా వైద్యం చెయ్యడం వల్ల డాక్టర్ కు కట్టే డబ్బులతో పాటు, మానసిక వ్యధని కు నివారించగలుగుతారు. వీటన్నిటిని పక్కన పెట్టి, అసలు సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగటానికి రోజు కింద వివరించినట్టుగా కొన్ని చిన్న చిట్కాలు తప్పనిసరిగా పాటిస్తే పిల్లల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  నీరు నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. పిల్లలకు ఎక్కువ నీటిని, ద్రవ పదార్థాలను ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. తేనె ప్రతిరోజూ ఒక స్పూన్ తేనే పిల్లలకు ఇవ్వడం వలన రోగనిరోధక శక్తి పెరిగి జ్వరం,జలుబు,దగ్గు సమస్యలు ఉండవు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పేరుతో సిబిఐ ఎంక్వయిరీ కి ప్రభుత్వం ఆదేశించడాన్ని  నిరసిస్తూ ఈరోజు అందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి సంఘీభావం తెలిపారు.  ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముఖ్య నాయకులు,యువ నాయకులు ఈరోజు హరీష్ రావు గారిని వారి నివాసంలో కలిశారు.తెలంగాణ రాష్ట్రన్ని సస్యశ్యామలం చేసే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది తెలంగాణ ప్రజల,రైతుల జీవితాలను మార్చే ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే కాలేశ్వరంలో అవినీతి అంటూ కేసీఆర్ గారిని,హరీష్ రావు గారిని కేసుల పేరుతో వేధించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.ఈ సందర్బంగా క్రాంతి అందోల్ నియోజకవర్గం మొత్తం మీ వెంటే మేముంటామని,మీరు అధైర్య పడొద్దు అంటూ హరీష్ రావు గారికి అందోల్ నియోజకవర్గ కార్యకర్తలు భరోసా ఇచ్చారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం మానేసి కేవలం రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ తీరు పైన మండిపడ్డారు. ప్రజల సంక్షేమం, రైతులకు సకాలంలో ఎవరువులు, వృద్దులకు పెన్షన్, యువతకు ఉద్యోగ కల్పన వంటివి గాలికి వదిలేసి, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాపైన ఎన్ని కేసులు పెట్టిన తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని అ
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . 

ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం.  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .  ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘన సన్మానం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా అందోల్ నియోజక వర్గం లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . ఈ సందర్బంగా నియోజక వర్గం లోని ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఘనంగా సన్మానించారు . ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు . ప్రభుత్వం విద్య , వైద్య రంగాల అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అందోల్ నియోజక వర్గాన్ని విద్య , వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . నియోజక వర్గం లో బాలికల విద్యాభివృద్ధి కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . ఇప్పటికే మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ లు , నర్సింగ్ కాలేజీ లు , కేజీబీవీ లు , మోడల్ స్కూల్ లు , గురుకులాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు , సుమారు 160 ఎకరాల్లో JNTU ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు . మెరుగైన విద్య, ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్శింహా . ఉత్తమ పౌరులుగా తీర్చిద్దిదే గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు . ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు  అందుకున్న అధ్యాపకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

\క్లింకారా న్యూస్: సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లో సింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు

\క్లింకారా న్యూస్: సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లో సింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు క్లింకారా న్యూస్:సింగూర్ డ్యాం నుంచి 2, 335 క్యూసెక్కులు ఔట్ ఫ్లోసింగూరు డ్యాంలోకి శుక్రవారం 2,995 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని ఇరిగేషన్ ఏఈ జాన్ స్టాలిన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29,917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.018 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కోసం 2,335 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు. :మద్ది శెట్టి

భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు.  :మద్ది శెట్టి భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన  సి. పి. రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు. :మద్ది శెట్టి క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 9     ఎన్డీఏ తరఫున విజయం సాధించిన మీకు, మా పార్టీ ఎన్సీపీ (ఎన్డీఏ కూటమి) తరఫున నేను మద్దిశెట్టి సామేలు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం 452 ఎలక్టోరల్ ఓట్లు (సుమారు 60.10% చెల్లుబాటు అయ్యే ఓట్లు) సాధించడం, పార్లమెంట్ సభ్యులు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. మీరు రాజ్యసభను జ్ఞానం, గౌరవం మరియు రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన కట్టుబాటుతో ముందుకు నడిపిస్తూ విజయవంతమైన పదవీకాలాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. మద్దిశెట్టి  సామేలుతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్సీపీ (ఎన్డీఏ కూటమి)
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

Klinkara news సంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్

Klinkara news సంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ Klinkara newsసంగారెడ్డి: నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్న రేవంత్ సర్కార్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు బలవుతున్నారని, గ్రూప్-1 పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా ప్రభుత్వానికి తెలియదని ఆయన పేర్కొన్నారు.
Read More...
ప్రత్యేకం  తెలంగాణ  ఆంధ్ర ప్రదేశ్ 

ఈరోజు తేదీ.8-9-2025 చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లా MRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు

ఈరోజు తేదీ.8-9-2025 చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లా MRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈరోజు తేదీ.8-9-2025చలో కలెక్టరేట్ కరీంనగర్ జిల్లాMRPS. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వికలాంగుల వృద్ధుల వితంతువుల చేనేత గీత బీడీ. పెన్షన్ దారులు పాల్గొన్నారు---------------------------------------- * సెప్టెంబర్ 8 న కరీంనగర్కలెక్టర్ ఆఫీస్ కార్యాలయ ముట్టడి *మహాధర్నా విజయవంతం   ఈ సమావేశం VHPS . అనవేని కౌసల్య ఆధ్వర్యంలో  కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర మహాధర్నాఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS. కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంద.రాజు మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమ ఎన్నికల మేనిఫెస్టో వృద్ధులకు వితంతువులకు మరియు వికలాంగులకు ఉన్నదాంట్లో రెట్టింపు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్ పెంపు విషయంలో జాప్యం చేయడం ఏమాత్రం సరికాదని మీ కాలయాపనతోని పరిపాలన కొనసాగుతుందని చేయూత పెన్షన్ దారుల ఆగ్రహానికి గురికాకముందే  వృద్ధులకు 4000 రూపాయలు వితంతులకు 4000 రూపాయలుగీత కార్మికులకు బిడి కార్మికులకు 4000 రూపాయలు వికలాంగులకు 6000 చెల్లించి 20 నెలల బకాయి ని కూడా వెంటనే మంజూరు చేసి వృద్ధుల వితంతువుల వికలాంగుల  అభిమానాన్ని చూడగలగాలని   లేని పక్షంలో          వికలాంగులు వృద్ధులు వితంతువులు మరియు అసరా పింఛన్ దారుల ఆధ్వర్యంలో వేలాది మందితో*ఈ నెల సెప్టెంబర్ 8,న చలకలెక్టరేట్ ముట్టడి* (మహాధర్నా) పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ ముట్టడి కార్యక్రమంలో డివిజన్ బస్తుల  లోని వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు  కరీంనగర్. కలెక్టర్ ఆఫీస్  కు పెద్ద ఎత్తున ధర్నా జరిగే పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని.VHPS. రాష్ట్ర నాయకులు.అంజి రెడ్డి అన్న MRPS . కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగMPS. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదిగMMS. కరీంనగర్ జిల్లా కన్వీనర్ దండు వరలక్ష్మి మాదిగ కో ఇంచార్జి. బుద్ధులవాణి జోషి మాస్టిన్ విభాగంMFS. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు .నవీన్ మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు మారెపల్లి శ్రీనివాస్ మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు చిలుమల రాజన్న మాదిగ MSP. రాష్ట్ర సీనియర్ నాయకులు ఆడపు.నరసయ్య మాదిగMSP. జిల్లా సీనియర్ నాయకులు ఎలుక పెళ్లి పౌలు మాదిగ VHPS. కరీంనగర్ సీనియర్ నాయకులువేముల బాపురెడ్డి VHPS వడ్డేపల్లి రమేష్ మాదిగVHPS. అంతడుపులసంపద మాదిగCPHPS. దేవసాని ప్రియదర్శిని.రేణుక అక్క మల్లక్క  వినోద ఎలీషా కొరక్క నిర్మలసంధ్యారాణి శోభక్క భాగ్యలక్ష్మిMRPS. జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర ఆదిత్య మాదిగMRPS. జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరిరవీందర్ మాదిగ MSP. కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి దండు అంజయ్య మాదిగMSP. జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరు రాజన్న మాదిగMSP. జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల మధునయ్య మాదిగMSP కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. తడగొండ శంకర్ మాదిగ MRPS. జిల్లా ఉపాధ్యక్షులుకనకం అంజిబాబు మాదిగ దోమ కంటి శ్రీనివాస్ మాదిగ.మలుగూరి అశోక్ మాదిగ అలవాల సంపత్ మాదిగ రేపాక బాబు మాదిగ మిట్టపల్లి రాజేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ వికలాంగులు వృద్ధులు వితంతులుఒంటరి మహిళలు మరియు అనుబంధ సంఘాలు పాల్గొన్నారుమీ సామాజిక ఉద్యమ నమస్కారాలు  MRPS కరీంనగర్ జిల్లా ఇన్చార్జిమంద రాజు మాదిగ
Read More...
ప్రత్యేకం  తెలంగాణ 

క్లింకార న్యూస్ సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం

క్లింకార న్యూస్ సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం క్లింకార న్యూస్సదాశివపేట: డిగ్రీ కళాశాలలో అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వైస్ ప్రిన్సిపల్ సిద్ధులు తెలిపారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంపై వీడియో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Read More...