జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా. పత్రిక ప్రకటన తేది: 22.09. 2025,
జిల్లా పోలీస్ కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా.
పత్రిక ప్రకటన తేది: 22.09. 2025,
• సంగారెడ్డి జిల్లా పోలీసులకు ప్రత్యేక గ్యాస్ పంపిణీ సౌకర్యం..
• గ్యాస్ పంపిణీ ఆటో ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు..
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది సౌకర్యార్థం గ్యాస్ సిలిండర్ను ఆటో ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్పీ గారు అన్నారు. సిలిండర్ అవసరమున్న సిబ్బంది ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని, బుకింగ్ చేసిన తర్వాత, రెండు రోజుల కాల వ్యవదిలో పోలీసు విభాగంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటో ద్వారా గ్యాస్ సిలిండర్ను గృహద్వారం వద్దకు తీసుకురావడం జరుగుతుంది అన్నారు. ఈ ప్రత్యేక సౌకర్యం ద్వారా సిబ్బందికి సులభమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావ్, ఎ.ఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియల్, హోమ్ గార్డు సిబ్బంది తదితరులు ఉన్నారు.
Comment List