విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వల
క్లింకార న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జూన్ 6
పాండురంగాపురం శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన విగ్రహ ప్రతిష్ట పూజలు
పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల
పాల్వంచ మండలం పరిధిలోని పాండురంగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో మూడు రోజులుగా జరుగనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శుక్రవారం పండితులు శ్రీమాన్ కందాల సింహాద్రి ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
ఈ ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు అజ్మీరా జగదీష్, బానోత్ లక్ పతి, బానోత్ కుమార్, వాంక్ డోత్ చిన్న వీరు, ఇస్లామాట లాల్, గుగులోత్ కిషోర్, బానోత్ ప్రసాద్, ఇస్లావత్ దేవి, మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు జలీల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, వై వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా, మాలోత్ కోటినాయక్, అలెక్స్, తదితరులు పాల్గొన్నారు.
Comment List