అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు
అమృత్ 2.0 ద్వారా ఇంటింటికి నీరు
అమృత్ 2.0 ద్వారా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందిస్తామని నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ పురపాలక సంఘం 1వ వార్డు చాంద్ ఖాన్ పల్లి లో అమృత్ 2.0 లో భాగంగా నూతన పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ. 13.5 కోట్లతో అమృత్ 2.0 పథకానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో నీటి సరఫరాకు పైప్ లైన్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అమృత్ 3.0 కు కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో నీటి ఎద్దడి లేకుండా నారాయణఖేడ్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మేనేజర్ వెంకట శివయ్య, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, కాంట్రాక్టర్ సాల్మాన్ రాజ్, నాయకులు ముదిరాజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List