ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6
ప్రజలకు న్యాయం అందించాలన్న లక్ష్యంతో లాయర్ ప్రవేశ పరీక్ష రాసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి, జూన్ 6
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ న్యాయ రంగంపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ లో లాయర్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు ప్రజలకు న్యాయం అందించాలన్న ధ్యేయంతో ఆయన ఈ పరీక్ష రాశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ విద్య నాకు చిన్ననాటి నుంచీ ఇష్టం అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరంగా సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ఎమ్మెల్యేగా ప్రజల అభివృద్ధికికోసం పని చేయడమే కాకుండా న్యాయ రంగంలోకి ప్రవేశించి మరింత సేవ చేయాలన్న అభిలాషతో ఈ పరీక్ష రాసినట్టు తెలిపారు సాధారణ ప్రజలకు అండగా నిలబడటమే నా బాధ్యత అని స్పష్టం చేశారు..
న్యాయ విద్య ద్వారా మరింత అవగాహన పెంచుకుని ప్రజలకు మంచి చేయాలన్న మంచి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తుండటం యువతకు ప్రేరణగా నిలుస్తుంది ప్రజా ప్రతినిధిగా ఉన్నత విలువలతో మార్గదర్శకుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిలుస్తున్నారు
Comment List