ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానం
- ఎంపీకు ఆహ్వానించిన షహీన్ గ్రూప్ ఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్
షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరుకానున్నారని షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నారాయణఖేడ్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ మొయిజ్ అన్నారు.ఆదివారం ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ.. షాహిన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రజలు హాజరుకావాలని,ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ షాహిన్ గ్రూప్ షహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డాక్టర్ అబ్దుల్ ఖదీర్, ప్రేరణాత్మక వక్త మునవర్ జమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. కావున అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comment List