ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబం =సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగిలేటి, తుమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6
ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబం
=సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగిలేటి, తుమ్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు
క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్ 6
ఆ కుటుంబం కడు నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్లది. ఎన్నో ఏళ్లుగా ఏదో రకమైన తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే గాక, ఇల్లు కట్టుకునేందుకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారుల ఆధ్వర్యంలో ముగ్గు పోశారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెళ్లి విరిసింది. వివరాల్లోకి వెళ్తే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచూరుపల్లి రెవెన్యూ గ్రామ శివారు లచ్చపురం ఎస్సీ కాలనీకి చెందిన రావూరి సునీత.. రాంబాబు దంపతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును కేటాయించారు. ఆ ఇంటికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు, గ్రామస్తుల సమక్షంలో ముగ్గు పోసి శంకుస్థాపన చేయడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా సునీత.. రాంబాబు దంపతులు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. మా ఆర్థిక స్థితిగతులు మా బాధలు తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాకు ఇంటిని కేటాయించడంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామంలోని కాంగ్రెస్ నాయకుడు తిరువీధుల జేమ్స్ చొరవతోనే మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరి అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇల్లు లేని మా నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మండల నాయకులు తిరివీధుల జేమ్స్, గద్దల వెంకటరమణ, రావూరి వెంకటేశ్వరరావు ఉన్నారు.
Comment List