సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు. 

On
సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు. 

 సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భుభారతి చట్టం - 2025 పైన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు. 

క్లింకారా న్యూస్ సంగారెడ్డి:

👉భూభారతి చట్టం రైతులకు చుట్టం: సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ .

సంగారెడ్డి మండలం కులబ్ గూర్ గ్రామంలో భూభారతి చట్టం-2025 పైన సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మండల డిప్యూటీ తహశీల్దార్ నరేష్ మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల వద్దకే పాలన అని రైతులు కార్యాలయాల చుట్టు తిరగకుండా గ్రామ స్థాయిలో భూసమస్యల పరిష్కారం కోసం అధికారులే ప్రజల వద్దకు వచ్చి భూములకు సంబంధించిన సర్దుబాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల భూములకు సంబంధించి సర్వే నంబరు, విస్తీర్ణం, పట్టాదారు పేర్లు తప్పుల సవరణ చేపట్టారు. మండల రెవెన్యూ అధికారులు భూభారతి అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి ఆకస్మికంగా వచ్చి రెవెన్యూ అధికారుల పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాధురి మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న భూములను, పట్టా భూములు అసైన్డ్ భూములు పరిశీలించి త్వరగా రైతులకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కులబ్ గూర్ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ హాశం అలీ, రెవిన్యూ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

91

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని