లోకేష్‌ సవాల్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

On
 లోకేష్‌ సవాల్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. అనేక అంశాల్లో అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్.. భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ.. రూపాయికి మూడు వేల కోట్ల రూపాయిల భూములు ఇస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ వేల కోట్ల భూములు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

లేటెస్ట్‌గా జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఉర్సా కంపెనీకి తక్కువ రేటుకు భూములు ఇచ్చినట్టు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్‌ వేదికగా సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెబితే చాలన్నారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్‌కు కొత్తేమీ కాదన్నారు. ఇక ఉర్సా కంపెనీకి ఏ ధరకు ప్రభుత్వం భూములు కేటాయించిందనే విషయాలను కూడా వివరించారు లోకేష్‌. విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్నారు.

ఉర్సా భూముల విషయంలో వైసీపీ అధినేత పదే పదే విమర్శలు చేస్తుండటంతో.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది కూటమి సర్కార్. అందుకే ఈ అంశంపై కేవలం కౌంటర్ ఇవ్వడం కాకుండా.. మరోసారి ఈ విషయంలో వైసీపీ విమర్శలు చేయకుండా ఉండేలా ధీటైన జవాబు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే జగన్ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ సవాల్ విసిరినట్టు కనిపిస్తోంది. మరి.. లోకేష్‌ సవాల్‌పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

lokesh jagan photo

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
రెడ్డిగూడెం గ్రామం లో ప్రభుత్వ చౌక ధరల దుకాణాన్ని సందర్శించిన ఎమ్మెల్యే క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూన్, 8అన్ని వర్గాల అభివృద్ధి...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దశరథ్ .
ఈనెల 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్ లో జరిగే వ్యక్తిగత అభివృద్ధి కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కు ఆహ్వానించారు.
నూతన హాస్పిటల్ ను ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
15వ డివిజన్ సీనియర్ నేత ఉప్పరి ఉదయ్ కుమార్ గారిని పరామర్శించినపీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గారు నారాయణఖేడ్ మండలం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని15వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని