క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
క్లింకారా న్యూస్:- నారాయణఖేడ్ నియోజకవర్గం-మనూర్ మండల్
*నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
మనూర్ మండల కేంద్ర పరిధిలోని రైతు వేదికలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపునిండా సన్న బియ్యం పెట్టాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
గత బిఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా నూతన రేషన్ కార్డులను ఇవ్వలేదని 10 సంవత్సరాల యువతి యువకులకు వివాహం జరిగి వారికి పిల్లలు పుట్టి పెద్దగా అయిన ఇప్పటివరకు రేషన్ కార్డు లను ఇవ్వలేదని కనీసం వారి పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో చేర్చడానికి కూడా బిఆర్ఎస్ మరియు మాజీ ముఖ్యమంత్రి అవకాశం కల్పించలేదని
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ ఒకటిన్నర సంవత్సర కాలంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులను హలో లబ్ధిదారులకు అందిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రేషన్ కార్డులు ప్రజలకు అందించమని మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పేద ప్రజలకు రేషన్ కార్డు లు అందుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
మనూర్ మండలనికి నూతన రేషన్ కార్డులు మొత్తం 324 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని ఇంకా కొంతమంది అప్లై చేసుకున్న వారికి కూడా త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రేషన్ కార్డుల పంపిణీ పక్కియ నిరంతరమని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల ఉన్నతాధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comment List