క్లింకార న్యూస్ డయాలసిస్ పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది
On
క్లింకార న్యూస్
డయాలసిస్ పేషంట్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్తగా మరో 681 మంది డయాలసిస్ పేషంట్లకు చేయూత పించన్లు మంజూరు చేసింది.ఈ మేరకు ఇవాళ మంత్రి సీతక్క సంబంధింత ఫైల్ పై సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 4011 మంది డయాలసిస్ పేషంట్లకు సామాజిక పించన్ ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 4029 మంది డయాలసిస్ తో ఇబ్బంది పడుతున్న వారికి చేయూత పించన్లు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో 681 మందికి పించన్లు మంజూరు చేసింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం గుర్తించింది.
వెరిఫికేషన్ పూర్తి చేసి పించన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త లబ్దిదారులు వచ్చే ఆగస్టు నుంచి ఒక్కొక్కరు నెలకు రూ.2016 చొప్పున పించన్ అందుకోనున్నారు.
Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Jul 2025 23:00:35
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
Comment List