తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన  బీసీ సామాజిక వర్గ ప్రజలు క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 

On
తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన  బీసీ సామాజిక వర్గ ప్రజలు క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 

తుమ్మలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన 
బీసీ సామాజిక వర్గ ప్రజలు
క్లింకారా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి, బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతాం అన్న మాటను నిలబెట్టుకున్న  రాష్ట్ర ప్రభుత్వం పై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న వేళ ఆదివారం గండుగులపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గ ప్రజలు దమ్మపేట మండలవాసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుముల రేవంత్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ లకు అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లికొండ నాగేశ్వరరావు, కెవి సత్యనారాయణ, కాసాని మల్లేశ్వరరావు, నాగప్రసాద్, నాయుడు రాధాకృష్ణ, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, పెద్దగౌండ్ల నరసింహారావు, పోలగాని చంద్రం, సురేష్, మారగాని నాగేశ్వరరావు, కందిమళ్ళ నాగప్రసాద్, మేక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250713-WA0104

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు* *భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*
*భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యక్రమంలో హైదరాబాదులో  పాల్గొన్న ఖేడ్ బిఆర్ఎస్వి నాయకులు*  నారాయణఖేడ్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్...
డిఎస్పీగా పదోన్నతి పొందిన దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ బి.అశోక్ , క్లింకారా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి జూలై
క్లింకార న్యూస్ సదాశివపేట సీఐ వెంకటేశం సంగారెడ్డి జిల్లా సదాశివపేట భారీ వర్షాల పట్ల ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా
క్లింకార న్యూస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామంలోని నారింజ ప్రాజెక్ట్ ఇటీవల కురుస్తున్న వర్షాలకు
క్లీన్కర న్యూస్ (వాట్పల్లి) మార్వెల్లి . 28/07/2025 నాడు మార్వెల్లి గ్రామమునకు విచ్చేయుచున్న శ్రీ మధు కాశి జ్ఞాన సింహానదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగత్ గురు డా: చంద్ర శేఖర
క్లింకార న్యూస్ శ్రీ రాచణ్ణ స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోహీర్
క్లింకార న్యూస్ సదాశివపేట: 'ప్రత్యేక అవసరాల పిల్లలకు మెరుగైన బోధన అందించాలి'