క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం - *ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ
క్లింకారా న్యూస్: -నారాయణఖేడ్ నియోజకవర్గం -
*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
నారాయణాఖేడ్ మున్సిపల్ పట్టణంలోని భూమయ్య కాలనీ లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గూడు లేని వారి గోస తీర్చడానికి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న *గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి*
*అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ*
🏠 రాష్ట్రంలోనీ ప్రతి ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
✴️ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గనీకీ 3500 ఇండ్లను మంజూరు చేసిందని ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 మంజరూ అవుతాయని పేర్కొన్నారు ఇల్లు రాలేదని ఎవరు అందులో చెందాల్సిన అవసరం లేదని విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలియజేశారు.
✴️ మొదటి విడతలో ఇల్లు మంజూరైన వారు తక్షణమే తమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన పూర్తి చేసుకోవాలన్నారు నిర్మాణ దశలను బట్టి సకాలంలో బిల్లులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు,
✴️ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందజేస్తుందన్నారు ఇందిరమ్మ మంజూరు అయి ఇంటి నిర్మాణానికి డబ్బులు లేని పేదలకు మహిళా సంఘాల నుంచి లక్ష రూపాయల రుణం ఇస్తున్నట్టు ఈ అవకాశాన్ని నిరుపేదలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు
ఈ కార్యక్రమంలో వారితో పాటు దారం శంకర్ సెట్ మున్సిపల్ వైస్ చైర్మన్, పండరి రెడ్డి,అర్జున్ మాజీ ఎంపీటీసీ,ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్,నర్సింలు, మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్లు, మరియు కాలనీ పెద్దలు,మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List